అమరావతి : గుంటూరు(Guntur )జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రాక్టర్ను(Tractor )కారు ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. ప్రత్తిపాడు సీఐ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు మంగళగిరి వాసులుగా గుర్తించారు.