అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెదకాకాని వైజంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో దంపతులు, కుమార్తె మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి.
మృతులు గోపీకృష్ణ(34), శిరీష(29), స్నేహధృతి(5) చనిపోగా కుమారుడు లోహిత్ సాయికి గాయాలు అయ్యాయి. మృతులు విజయవాడ కస్తూరిబాయిపేట వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.