అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి(East Godavari )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో(Car collision) ముగ్గురు దుర్మరణం చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గల జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రం వైపు నుంఇ విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమారమిచ్చి క్షతగాత్రులను గోపాలపురం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dhurandhar 2 | ఆదిత్య ధర్ బీజేపీ ప్రచారకర్త.. ‘ధురంధర్2’పై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు
Mamata Banerjee | అతిపెద్ద చొరబాటుదారుడు మోదీయే.. ప్రధానిపై బెంగాల్ సీఎం మమత ఘాటు విమర్శలు