Dhurandhar 2 | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర స్థాయిలో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇప్పటికే ఈ సినిమాను కొందరూ ప్రముఖులు బీజేపీ ప్రచార చిత్రం అని కామెంట్స్ చేస్తుండగా.. తాజాగా ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ ఈ సినిమాను పచ్చి ప్రచార చిత్రం (Blatant Propaganda) అంటూ కామెంట్లు చేశాడు. ఆదిత్య ధర్ ఒక బీజేపీ ప్రచారకర్త అని తాను గతంలోనే చెప్పానని, ఇప్పుడు ధురంధర్ 2తో అది స్పష్టమైందని రాఠీ ఘాటుగా విమర్శించారు. మొదటి భాగంలో ప్రచారం కాస్త పద్ధతిగా ఉన్నా, రెండో భాగంలో మాత్రం దర్శకుడు తన అతివిశ్వాసంతో బహిరంగంగా ప్రచార అజెండాను నడిపించారని ఆయన మండిపడ్డారు. ఇది సరైన నాణ్యత లేని ప్రచారమని, ఈ సినిమా చూడటం వల్ల మెదడు మొద్దుబారిపోతుందని ఆయన ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.ఈ విమర్శలు ఒకవైపు కొనసాగుతుండగానే, ‘ధురంధర్ 2’ బాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది.
I called Aditya Dhar a BJP propagandist 3 months ago.
Now everyone will see it. It was subtle in the previous film, but he went so blatant this time in overconfidence. Remember how I said, well-made propaganda is more dangerous? Ab toh well-made bhi nahi raha. Lol
— Dhruv Rathee (@dhruv_rathee) March 19, 2026