అమరావతి : పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులంతా దొరపల్లె వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేశారు. మృతుల బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.