అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏపీ క్యాబినేట్, అసెంబ్లీ సమావేశంలో బిల్లులను రద్దు చేస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం కోర్టుకు వివరించగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పేర్కొంది. వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని ఏజీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది .