అమరావతి : అమరావతి రాజధానిని విమర్శించిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుందని త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ ప్రకటించిన నేపథ్యంలో రైతు నాయకులు స్పందించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వారు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎవరైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని గుర్తు చేశారు. ఇక నైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.