అమరావతి : ఆర్థిక ఇబ్బందులతో భర్త ఆత్మహత్య చేసుకోగా భర్తలేని జీవితం ఎందుకుని భార్య కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన చేసుకుంది. శ్రీకాకుళంలో జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కుక్కలవానిపేటలో ఆర్థిక సమస్యలతో కేశవ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు