తిరుమల : గోవిందా నామ స్మరణతో తిరుమల (Tirumala) ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని 69,874 మంది దర్శించుకోగా 26,034 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.39 కోట్లు వచ్చిందని తెలిపారు.