అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి గ్రామీణం అలిగుంటపాలెం క్రాస్రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా డివైడర్ను ఢీకొని కారు టైర్పేలి పంట కాల్వల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.