తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, జెఈవో వీర బ్రహ్మం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ విద్యార్థులను అభినందించారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయం 22,23వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 22వ స్నాతకోత్సవంలో ఆయుర్వేద వైద్య విద్యకు సంబంధించి పది మెడల్స్ ను సొంతం చేసుకున్నారు. బంగారు, వెండి పతకాలు, నగదు బహుమతులను ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 23వ స్నాతకోత్సవంలో కూడా ప్రధానమైన 7 బంగారు పతకాలు,వెండి పతకాలు,నగదు బహుమతులను కళాశాల విద్యార్థులు సాధించారు.