అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది.
కుప్పంలో సాయంత్రం 5గంటల వరకు 76.49శాతం పోలింగ్ జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలో 61.6 శాతం, దాచెపల్లిలో 71.88శాతం, గురజాలలో 71.8శాతం, పెనుకొండలో 82.63శాతం, కొండపల్లిలో 66.79శాతం నమోదు అయ్యింది. మున్సిపల్, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 17న చేపట్టనున్నారు. నెల్లూరు నగరపాలికతో పాటు, కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, బేతంచర్లలో ఈరోజు పోలింగ్ జరిగింది.