తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు(Annaprasadalu) అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ (TTD) ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని జేఈవో వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు. భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర, సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడి సరుకుల నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమిస్తామన్నారు. 10 – 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు(Cheff) , క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు.
Read More :