అమరావతి: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఏపీ మంత్రి అప్పలరాజు పరామర్శించారు. గ్రామానికి చెందిన దీప, ఆకాష్, నక్షత్ర అనే కుటుంబంలోని ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు వారిని గమనించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు పలాస ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. స్వయానా డాక్టర్ అయిన మంత్రి స్టెతస్పోప్తో వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు.