తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala)కు చేరుకుంటున్నారు. భక్తుల రాక వల్ల 20 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 62, 880 మంది భక్తులు దర్శించుకోగా 21, 904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.03 కోట్లు వచ్చిందని తెలిపారు.