అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘మూడు హత్యలు.. ఆరు మానభంగాలు’ కొనసాగుతున్నాయని అని చెబుతుంటే బాధేస్తోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు . ఆయన ఢిల్లీలో మీడియా తో మాట్లాడారు. .2021లో అత్యధిక లాకప్ డెత్లు ఏపీలోనే జరిగాయని, ‘అదృష్టం బాగుండి తాను బయటపడ్డా ’ నని పేర్కొన్నారు. ‘ శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని’ విమర్శించారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిందని వివరించారు.
మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు . మహిళలపై భౌతిక దాడుల ఘటనలో మొదటి స్థానంలో, పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనలో 2వ స్థానంలో ఉండడం విచారకరమని వెల్లడించారు. 2019తో పోలిస్తే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతం పెరిగిందని తెలిపారు. ప్రతి 3 గంటలకు ఒక ఎస్సీపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగు తున్నాయని, లేని చట్టాల గురించి మా పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.