హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసే అంశాన్ని హైకోర్టు రిజర్వులో ఉంచింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. అనారోగ్య కారణాలపై చంద్రబాబుకు హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్షా అప్రూవర్గా మారారు. చంద్రకాంత్ను డిసెంబర్ 5న హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది.