అమరావతి : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆస్పరి మండలం ముత్తకూరులో మరదలిని కొట్టి చంపిన బావ ఆతరువాత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలోని లింగమ్మ(52) అనే మహిళ, ఆమె బావ హనుమంతు మధ్య రాత్రి ఘర్షణ జరిగింది. దీంతో కోపంతో ఆమెను రాళ్లతో కొట్టి చంపి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.