అమరావతి : పలు కేసుల్లో నిందితుడిగా పట్టుబడి రిమాండ్ నిందితుడు ఒకరు పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన సంఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నాడ రాంబాబు అను ముద్దాయిని పాలకొండ సబ్జైలుకు తరలిస్తుండగా రాజాంలో తప్పించుకున్నాడు. నిందితుడు రాంబాబును పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రత్యేక బృందాలతో రాజాం, పాలకొండ, విజయనగరం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు తప్పించుకోవడంపై పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.