అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలను సోమవారానికి వాయిదా వేశారు. సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా ఫలితాలు వాయిదా వేసినట్లు వెల్లడించారు. సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీవరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పది పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఎవరైనా ర్యాంకులపై ప్రకటనలు ఇచ్చే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇదివరకే విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.