హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉన్నదని వివరించారు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఈ పిటిషన్తోపాటు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కూడా న్యాయవాదులు జత చేసినట్టు తెలిసింది.