తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Justice Santosh reddy) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న జస్టిస్ సంతోష్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆయనకు ఆలయన అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి భారీగా భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. తిరుమలలో గురువారం 67,625 మంది భక్తులు దేవదేవుడిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే రూ.4.05 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది.