Pawan kalayan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూన్ 2న (రేపు) హైదరాబాద్లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టడం లేదని, సమావేశం నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారమిస్తే సరిపోతుందని.. అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. పోలీసులు సరైన కారణాలు చెప్పకుండా అనుమతి నిరాకరించారని, సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు.