Viral News : రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Bengaluru) లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక (Karnataka) గవర్నర్ కాన్వాయ్ (Governors Convoy) ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్తుండటంతో పోలీసులు ఆ మార్గంలో దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ను నిలిపిశారు. దాంతో ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గర్భవతిగా ఉన్న తన భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ట్రాఫిక్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగారు. గవర్నర్ కాన్వాయ్ వచ్చే మార్గంలో బైఠాయించారు. అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గం ఇప్పటికే రద్దీగా ఉందని, ఈ విధంగా గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తన భార్య గర్భవతి అని, అత్యవసర వైద్య పరిస్థితి కంటే వీఐపీ కాన్వాయ్లకే ప్రాధాన్యమిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్రాఫిక్ క్లియర్ చేసేవరకు రోడ్డుపై నుంచి కదలనని అతను కరాఖండిగా చెప్పడంతో పోలీసులు ఓ వైపు నుంచి వాహనాలను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వీఐపీ కల్చర్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘వీఐపీల సౌకర్యాలకు ఇచ్చే విలువ ప్రజల ప్రాణాలకు లేకుండా పోతోంది’ అంటూ మండిపడ్డారు.
Bengaluru Man Protests On Road After Governor’s Convoy Halts Traffic, Leaves Pregnant Wife Stuck pic.twitter.com/capYK85bo9
— NDTV (@ndtv) June 1, 2026