అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు, శివారెడ్డిల ఫ్లెక్సీలను దుండగులు చింపేశారు. కాగా ఏపీ ఎన్జీఒ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించే అవకాశం ఉందంటూ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తంమయ్యారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు అదనపు బలగాలను దించారు పోలీసులు. అంతేకాదు ఏపీ ఎన్జీఒ భవనం వద్ద రహదారిని బారికేడ్లతో మూసివేశారు. ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే ఆయా ప్రాంతం వైపు అనుమతిస్తున్నారు పోలీసులు.