అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తి పోయారని అన్నారు.
సీఎం జగన్ తీసుకుంటున్న ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలతో పాటు అన్ని వర్గాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై పార్టీ స్థానిక నాయకులు పోరాటాలను పెంచాలని , ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో కొవిడ్ బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.