TDP | అమరావతి : టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలను కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 128 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరో 16 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. లోక్సభ అభ్యర్థులను మాత్రం ఇప్పటి వరకు ఒక్కర్ని కూడా ప్రకటించలేదు. 17లో 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పది మంది పేర్లను మంగళవారం సాయంత్రం నాటికి ప్రకటించే అవకాశం ఉంది.