అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిళ్లతో నిరసన ర్యాలీ తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీడీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద సీఎం జగన్, అంబటి దిష్టిబొమ్మలను టీడీపీ నాయకులు దహనం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక ప్రభుత్వానికి ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.