అమరావతి : టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) అన్నారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్(BC Declaration ) తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. బీసీల డీఎన్ఏ(DNA) లోనే టీడీపీ ఉందని అన్నారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని సూచించారు. బీసీలు సమాజానికి వెన్నెముక అని సీఎం జగన్(CM Jagan) తెలుసుకోవాలని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పెట్టిన మూడు సభలకు హాజరైన జనాన్ని చూసి వైసీపీ వణికిపోతుందని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ సబ్ప్లాన్ ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ. లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందజేస్తామని ప్రకటించారు.పింఛన్ నెలకు రూ.4వేలకు పెంచుతామని , బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని(BCs protection Act) తీసుకువస్తామని అన్నారు. సబ్ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని, స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. రూ.5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు అందజేస్తామని స్పష్టం చేశారు.