తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
కాగా ఇటీవల కురిసిన వర్షాలకు విరిగిపడ్డ కొండ చరియాలతో ధ్వంసమైన రోడ్లను, రక్షణ గోడలను టీటీడీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల పనులను ప్రారంభించింది.