అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో పట్టుబట్టిన టీడీపీ సభ్యులను ఏపీ స్పీకర్ సస్పెన్షన్ చేశారు. ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు కాగితాలను చింపివేసి స్పీకర్పై వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ పోడియంను ముట్టడించి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ అధికార సభ్యుల అంగీకారంతో సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు అశోక్, కింజవరపు అచ్చెన్నా యుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట్రెడ్డి, జోగేశ్వర్రావు, పయ్యవుల కేశవ్, వెలగపుడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరు సాంబశివరావు, బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు.