అమరావతి: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. దాంతో ఫైబర్ నెట్ కేసును కోర్టు వాయిదా వేసింది.
స్కిల్ స్కామ్ కేసులో బాబు క్వాష్ పిటిషన్పై హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. కేసులో 17A వర్తించదని రోహత్గీ, వర్తిస్తుందని హరీష్ సాల్వే వాదనలు కొనసాగిస్తున్నారు.