అమరావతి : ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఏపీ వైపు పయనం కానుంది. ఆ తర్వాత తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ఏర్పడితే సిత్రాంగ్గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావం పడనుంది.