ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదు. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారు అని పిటిషన్లో సునీతరెడ్డి పేర్కొన్నారు.