అమరావతి : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం దాసరిపాలెం గ్రామంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పొలంలో పురుగుమందు తాగి వీరరాఘవులు, సుబ్బాయమ్మ అనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.