అమరావతి : హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవీన్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. సకాలంలో స్పందించి యువకుడి చేతిలో నుంచి అఖిలపక్ష నేతలు పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.