అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్(Online Betting )లకు అలవాటు పడి అప్పులపాలై ఆత్మహత్య(Sucide) చేసుకున్నాడు. జిల్లాలోని పాయకరావు పేట బృందావన్ కాలనీకి చెందిన కోనేటి మణికంఠ సాయికుమార్ అనే యువకుడు గత కొన్ని నెలలుగా ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటుపడ్డాడు. తన వద్ద ఉన్న సొమ్మునంతా బెట్టింగ్లో పెట్టి తీవ్రంగా నష్టాల పాలయ్యాడు.
ఎలాగైనా పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకోవాలన్న దురాశతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేసి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడ్డాడు. దీంతో ఉన్నదంతా కోల్పోయి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడినికి విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్(Hospital) చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) వివరించారు.