అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. తాళ్లపూడి మండలం గజ్జెరం గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి వైష్ణవ్ కుమార్ హాస్టల్ మరుగుదొడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితమే అతడిని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో చేర్పించారు.
అయితే పాఠశాలలో చేరడం ఇష్టంలేకే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.