అమరావతి : పోలీసులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఏపీలో పలు అనర్థాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు.
అధికార పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో జూదం, క్యాసినో కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ క్యాసినోపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వల్లే కంకిపాడులో మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.