అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై నిగ్గుతేల్చేందుకు గుడివాడకు వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి కొడాలి నానికి సంబంధించిన కే కన్వేషన్కు బయలు దేరడానికి బయలు దేరిన నాయకులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యతో పాటు మరికొందరిన టీడీపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
కాగా గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. కొంతసేపు పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకోవడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నాని, పోలీసులు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. బొండ ఉమకు చెందిన వాహనాన్ని కొందరు వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, శ్రేణులు గుడివాడకు చేరుకున్నారు.
టీడీపీ శ్రేణును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రావడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలోని నాగవర్పాడు సెంటర్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నగరంలో బారికెడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.