తిరుపతి : సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పం తోనే టీటీడీ వరుణ యాగం నిర్వహించినట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhuman Karunakar Reddy ) చెప్పారు. శ్రీనివాసమంగాపురం ఆలయంలో అష్టోత్తర శత కుండాత్మక మహా శాంతి వరుణ యాగం ముగింపు సందర్భంగా సోమవారం ఈవో ఎవి ధర్మారెడ్డి తో కలసి గోపూజ చేశారు . అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారు. మూడు రాష్ట్రాలకు చెందిన 210 మంది రుత్వికలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యాగం నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు , టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్, డీపీపీ కార్యదర్శి శ్రీనివాసులు , ఏఈవో గోపీనాథ్ పాల్గొన్నారు.