అమరావతి : ఏపీలోని రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబాయి విమాన సర్వీస్ (Flight service) గురువారం నుంచి ప్రారంభమయ్యింది. ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్టుకు మొదటిసారిగా వచ్చిన ఇండిగో ఎయిర్ బస్లో (Indigo Air Bus) కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు (Minister Rammohan Naidu) , పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి (Purandeshwari ) రాజమండ్రికి వచ్చారు.ఈ సందర్భంగా విమానానికి వాటర్ కెనాన్లతో సిబ్బందితో స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంతకుముందు ఢిల్లీకి, విదేశాలకు వెళ్లాలంటే విజయవాడ, విశాఖ, హైదరాబాద్కు వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇకపై ముంబాయి, ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లవచ్చని తెలిపారు. కాకినాడు ఎయిర్పోర్టు విషయంలో ల్యాండ్తో సహా ఫిజిబిల్టిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
భవిష్యత్లోనూ తిరుపతి, షిర్టీ, జైపూర్, గుజరాత్ రాష్ట్రాలకు, ప్రధాన నగరాలకు బిజినెస్ కనెక్టివిటీని పెంచడానికి అవకాశముందని అన్నారు. 2027లో రాజమండ్రి పుష్కరాలకు కూడా విమానశ్రయాలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు.