తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని (Lord Venkateshwara Swamy) దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 56,501 మంది భక్తులు దర్శించుకోగా 21,203 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చిందన్నారు.