తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న( గురువారం) 70వేల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని వివరించారు. సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసమేతంగా స్వామిని శుక్రవారం ఉదయం దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.