శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు గేట్లద్వార 2,30,336, విద్యుదోత్పత్తి ద్వార 27,380, సుంకేసుల నుండి 77,919 క్యూసెక్కుల నీరు విడుదల కాగా.. సాయంత్రానికి జలాశయంలో 3,35,635 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదయింది. అదే విధంగా డ్యాం పది గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరచి 3,75,680 క్యూసెక్కులు విడుదల చేశారు.
అలాగే ఏపీ పవర్హౌస్ నుండి 30,432, టీఎస్ పవర్హౌస్ నుండి 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదోత్పత్తి చేసుకుని దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.99 టీఎంసీల నీటినిల్ల ఉన్నట్లు అధికారులు తెలిపారు.