మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ అగ్నిపమాపక కేంద్రం అధికారి రాఘవరెడ్డి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం మున్సిపల్ పరిధిలోని అవుసులపల్లిలో అగ్నిప్రమాదాలపై మాక్డ్రిల్ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రమాదవశాత్తు ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని ముందస్తుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో వంట గ్యాస్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందన్నారు. వేసవికాలంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాలలో అధికంగా పెట్రోల్ నింపరాదన్నారు. ఎండ వేడిమి వలన ప్రమాదానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది టీఆర్ఎస్ మాత్రమే