శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతించడం జరుగుతుంని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయశుద్ధి, శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంకాలపు పూజలు నిర్వహించబడుతాయన్నారు. రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించబడే పరోక్ష సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.