శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రముఖులు దర్శించుకున్నారు. కార్తిక సోమవారం తొలిరోజు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు కుటుంబసభ్యులతోపాటు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వారికి ఈవో లవన్న అర్చక వేదపండితులతో వేదాశీర్వచనాలు వల్లించి తీర్థప్రపాదాలు శేషవస్ర్తాలు అందించారు.