Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 3నుంచి 16వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే శ్రీశైల దేవస్థానం తరఫున ఆదివారం నాడు ఏఈవో మోహన్, అర్చక వేద పండితులు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో నాగేశ్వరరావు, అర్చకవేద పండితులు సాదర స్వాగతం పలికారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి అని శ్రీశైల ఆలయ అధికారులు తెలిపారు.