తిరుపతి : టీటీడీ (TTD) ఆధ్వర్యాన నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్,యూరప్ లో 8 దేశాలు 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను(Srinivasa Kalyanams ) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ టీటీడీ ఈవోజె శ్యామలరావును (EO Shyamala Rao) తిరుపతి పరిపాలన భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
అనంతరం వారు యూకే, ఐర్లాండ్, యూరప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ఆర్టీఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు వివరించారు.తిరు కళ్యాణ కార్యక్రమాలను టీటీడీ వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నాట్లు టీటీడీ వెల్లడించారు.
నవంబర్ 9న ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్, నవంబర్ 10న డబ్లిన్, 16న యూకేలోని బేసింగ్స్టోక్, 17 న నెదర్లాండ్లోని ఐండ్హోవెన్, 23న జర్మనీలోని హాంబర్గ్లో కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. 24న ఫ్రాన్స్ లోని పారిస్, 30న పోలాండ్లోని వార్సా , డిసెంబర్ 1న స్వీడన్లోని స్టాక్హోమ్, 7న యూకే లోని మిల్టన్ కీన్స్,8న యూకే లోని గ్లౌసెస్టర్, 14న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, 15న బెర్లిన్, 21న స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.